AP Police : రోడ్లపై గాలి తిరుగుళ్లు తిరిగితే ఊరుకోం: యువతకు పోలీస్ వార్నింగ్

AP Police
AP Police : యువతకు ఏపీ పోలీస్ శాఖ వార్నింగ్ ఇచ్చింది. అసాంఘిక చర్యలకు పాల్పడితే ఉపేక్షించబోమని హెచ్చరించారు. విచ్చలవిడిగా రోడ్లపై తిరుగుతున్న యువతకు తిరుపతి ఈస్ట్ సీఐ మహేశ్వర్ రెడ్డి కౌన్సెలింగ్ ఇచ్చారు. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం, మద్యపానం సేవించి అల్లర్లకు పాల్పడితే కేసులు తప్పవని ఆయన హెచ్చరించారు.
రూడ్లపై తిరుగుతున్న వాహనాలకు సరైన పత్రాలు ఉండాలని, ట్రిపుల్ రైడింగ్ కు పాల్పడితే సహించమని సీఐ వార్నింగ్ ఇచ్చారు. యువత సంఘంలో బాధ్యతగా మెలిగి మంచి పౌరుడుగా ఉండాలని కోరుకుంటున్నట్లు సీఐ మహేశ్వర్ రెడ్డి తెలిపారు.