New Pandemic : ప్రపంచ దేశాలకు హెచ్చరిక.. కరోనా తరహా మరో మహమ్మారి ముప్పు తప్పదా?

New Pandemic
New Pandemic : కోవిడ్-19 దృష్ట్యా తదుపరి మహమ్మారిని ఎదుర్కోవడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఇప్పటికే తన సన్నాహాలను ప్రారంభించింది. ప్రపంచ సంసిద్ధతను బలోపేతం చేసే లక్ష్యంతో సభ్య దేశాల మంత్రులు, ఇతర అగ్ర ప్రతినిధులతో ప్రపంచ ఆరోగ్య సంస్థ తన వార్షిక సమావేశాన్ని సోమవారం ప్రారంభించింది. ప్రముఖ బ్రిటన్ శాస్త్రవేత్త షాకింగ్ ప్రకటిన చేశాడు. ప్రపంచం మరో సంక్షోభం అంచున ఉందని.. దానిని నివారించలేమని ఆయన చెప్పారు.
బ్రిటన్ మాజీ చీఫ్ సైంటిఫిక్ అడ్వైజర్ సర్ పాట్రిక్ వాలెన్స్ మరో మహమ్మారి ఖాయమని, ప్రభుత్వం ఇప్పుడు దాని సన్నాహాలపై దృష్టి పెట్టాలని హెచ్చరించింది. హే ఫెస్టివల్లో వాలెన్స్ మాట్లాడుతూ.. రాబోయే ప్రభుత్వం బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కీలక సమస్యలను పరిష్కరించటానికి తక్షణ చర్య తీసుకోవాలని అన్నారు. కొత్త రాబోతున్న సంక్షోభాన్ని వీలైనంత త్వరగా గుర్తించడానికి మెరుగైన నిఘా వ్యవస్థలను ఏర్పాటు చేయాలని వాలెన్స్ అన్నారు. అతను 2021లో జీ7 నాయకులకు తన సందేశాన్ని పునరుద్ఘాటిస్తూ, సత్వర ప్రతిస్పందన ప్రాముఖ్యతను నొక్కి చెప్పాడు. ఒక వ్యాధిని ముందుగా గుర్తిస్తే, వ్యాక్సిన్లు, చికిత్స ద్వారా దానిని నివారించవచ్చని వాలెన్స్ అభిప్రాయపడ్డారు. ఇది COVID-19 మహమ్మారి సమయంలో విధించిన కఠినమైన పరిమితులను నివారించవచ్చు. వీటన్నింటికీ అంతర్జాతీయ సమన్వయం అవసరమని ఆయన హెచ్చరించారు.
జీ7 2021లో తాము లేవనెత్తిన అన్ని అంశాలను 2023 నాటికి ఒక రకంగా మర్చిపోయాయన్నాడు. ప్రస్తుతం ప్రపంచ దేశాలు సైనిక అవసరాల విషయంలో ఎంత అప్రమత్తంగా ఉంటారో.. సంక్షోభం విషయంలో అంతే అప్రమత్తంగా ఉండాలన్నారు.ఆర్మీ అవసరాలకు ప్రాధాన్యం ఇస్తూనే సంక్షోభ నివారణలపై దృష్టి పెట్టాలని తెలిపారు. సంక్షోభం సమయంలో వివిధ దేశాలు కలిసికట్టుగా పనిచేసేలా ఒప్పందం కుదుర్చుకునేందుకు చొరవ తీసుకోవాలని పిలుపునిచ్చారు.