Tirupati : తిరుపతిలో లడ్డూ కల్తీపై స్వామీజీల ఆందోళన

Tirupati Laddu Controversy
Tirupati Laddu : తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంపై స్వామీజీలు నిరసన బాటపట్టారు. ఏపీ, తెలంగాణ సాధు పరిషత్ ఆధ్వర్యంలో తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం ఎదుట స్వామీజీలు ఆందోళనకు దిగారు. లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా వారు ఆలయాల్లో అన్య మతస్థులను ఉద్యోగులుగా నియమించవద్దని డిమాండ్ చేశారు. టీటీడీ మాజీ ఛైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, అప్పటి ఈవోలు జవహర్ రెడ్డి, ధర్మారెడ్డి తదితరులపై చర్యలు తీసుకోవాలన్నారు. సేవ్ తిరుమల, సేవ్ టీటీడీ నినాదాలతో హోరెత్తించారు. వారితో టీటీడీ ఈవో శ్యామలరావు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా గత పాలక మండలిపై చర్యలు తీసుకోవాలని ఈవోకు వినతిపత్రం సమర్పించారు.