Priyanka Gandhi : ఎంపీగా పార్లమెంట్ లో ప్రియాంక గాంధీ తొలి ప్రమాణం.. వైరల్

Priyanka Gandhi
Priyanka Gandhi : పార్లమెంట్ శీతాకాల సమావేశాల 4వ రోజు తొలిసారి ఎంపీగా ప్రియాంక గాంధీ ప్రమాణస్వీకారం చేశారు. కేరళలోని వాయనాడ్ నుంచి లోక్సభ ఎంపీగా ప్రియాంక గాంధీ వాద్రా గెలిచారు. ఆమె తల్లి సోనియాగాంధీ, సోదరుడు రాహుల్గాంధీతో కలిసి పార్లమెంటుకు హాజరయ్యారు.. వయనాడ్ ఉప ఎన్నికల్లో ప్రియాంక గాంధీ వాద్రా 6.22 లక్షల ఓట్లతో గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి రవీంద్ర చవాన్ వసంతరావు కూడా నాందేడ్ పార్లమెంట్ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు.
ప్రమాణ స్వీకారోత్సవం ముగిసిన వెంటనే నినాదాలు ప్రారంభం కావడంతో ఉభయ సభలను రేపటికి వాయిదా వేయాల్సి వచ్చింది.
వక్ఫ్ బిల్లును పరిశీలించేందుకు ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) తన నివేదికను సమర్పించేందుకు నవంబర్ 29 గడువు పొడిగింపు కోసం ఒక తీర్మానాన్ని సమర్పించింది.
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ 25న ప్రారంభమైనప్పటికీ ముందస్తు అంతరాయాలు తలెత్తడంతో ఉభయ సభలు రోజంతా వాయిదా పడ్డాయి. మణిపూర్ అశాంతి, సంభాల్ హింస సహా పలు సమస్యలపై ఎంపీలు ఆందోళనకు దిగారు. 75వ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని రెండో రోజు సభ జరగలేదు. మూడో రోజు ఉభయ సభలు గంట వ్యవధిలో వాయిదా పడ్డాయి.