Kia factory : కియా పరిశ్రమలో భారీ చోరీ: 900 కార్ల ఇంజిన్లు ఎత్తుకెళ్లిపోయారు

Kia factory

Kia factory

Kia factory : శ్రీసత్యసాయి జిల్లా పెనుగొండ మండలంలోని కియా పరిశ్రమలో భారీ చోరీ జరిగింది. ఏకంగా 900 కార్ల ఇంజిన్లు మాయం కావడంతో కలకలం రేగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళితే, పెనుగొండ మండలం యర్రమంచి పంచాయతీ పరిధిలో ఉన్న కియా మోటార్స్ పరిశ్రమలో సుమారు 900 కార్ల ఇంజిన్లు చోరీకి గురయ్యాయి. ఈ విషయం మార్చి 19న కియా యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. కియా ప్రతినిధులు అధికారికంగా ఫిర్యాదు చేసిన అనంతరం పోలీసులు విచారణ చేపట్టారు.

ఈ భారీ చోరీపై దర్యాప్తు చేసేందుకు పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తోంది. కియా పరిశ్రమకు కంటైనర్ల ద్వారా కార్ల ఇంజిన్లు వస్తుంటాయి. ఈ క్రమంలో చోరీ జరిగిందా? లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

TAGS