
Mahbub Nagar DEO
ప్రమోషన్ ఇచ్చిన అనంతరం సినియారిటీ విషయంలో తనకన్నా జూనియర్ తర్వాతే ఉండడం వల్ల భవిష్యత్ లో తనకు మళ్లీ నష్టం జరిగే అవకాశముందని, తన సినియారిటీని సరి చేయాలని డీఈవోకు తన భర్తతో కలిసి వెళ్లి విజ్ఞప్తి చేసింది. మళ్లీ కోర్టు నుంచి అనుమతి తెచ్చుకోవాలన డీఈవో సూచించారు. ఆమె మళ్లీ కోర్టును ఆశ్రయించగా సినియారిటీ సరిచేయాలని కోర్టు ఆదేశించింది. కానీ కోర్టు ఆదేశాను డీఈవో అమలు చేయకుండా మరో రూ.లక్ష ఇవ్వాలని డిమాండ్ చేశారు. చివరకు రూ.50 వేలకు అంగీకరించాడు. న్యాయంగా తనకు రావలసిన ప్రమోషన్ రాకుండా, జూనియర్ కు ఇవ్వడమే కాకుండా, న్యాయస్థానం నుంచి వచ్చిన ఉత్తర్వులను అమలు చేయకుండా లంచం డిమాండ్ చేయడంతో ఆ ఉపాధ్యాయురాలు తన భర్తతో కలిసి ఏసీబీని ఆశ్రయించింది. దీంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి లంచం తీసుకుంటున్న డీఈవోను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు.