Telangana : తెలంగాణలో ఈ ప్రాంతాలకు మహర్ధశ.. ఊహించనంత అభివృద్ధి
Telangana : తెలంగాణ ప్రజలకు శుభవార్త! రాష్ట్రంలో కొత్తగా ఒక గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి నిర్మాణం చేపట్టనున్నారు. మంచిర్యాల నుండి వరంగల్ వరకు నిర్మించనున్న ఈ రహదారి నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం రూ.2,606 కోట్ల నిధులను కేటాయించగా, ఇప్పటికే భూసేకరణ ప్రక్రియ పూర్తయింది. రానున్న రెండు సంవత్సరాలలో రహదారి నిర్మాణం పూర్తి చేస్తామని నిర్మాణ కాంట్రాక్టర్లు వెల్లడించారు. ఈ నూతన రహదారి మంచిర్యాల, భూపాలపల్లి మరియు హనుమకొండ జిల్లాల మీదుగా వెళ్లనుంది.