Kamal Haasan : పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేసిన కమల్ హాసన్..

Kamal Haasan
Kamal Haasan : లోక్సభ ఎన్నికల వేళ మక్కల్ నీది మయ్యం అధి నేత కమల హాసన్ పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఫ్యూడల్ పాలిటిక్స్ చేసే వారితో కాకుం డా, దేశం కోసం నిస్వార్థంగా ఆలోచించే పార్టీలతో పొత్తు పెట్టుకుంటానని చెప్పారు. మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
రాజకీయాలు వ్యాపారంగా మారాయని కమల హాసన్ అన్నారు. రాజకీయ నాయకులు వ్యా పారుల్లా మారారని చెప్పారు. పొత్తులపై తమి ళనాడులో రాజకీయ పార్టీలతో చర్చలు జరుపు తున్నారా? అన్న ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పలేదు. ఇండియా కూటమిలో ఇప్పటివరకైతే భాగంకాలేదని కమల హాసన్ చెప్పారు.
కమల హాసన్ ఇండియా కూటమి వైపునకే మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కేంద్ర ప్రభు త్వంపై కమల హాస్ పదేపదే విమర్శలు చేస్తుం టారు. లోక్సభ ఎన్నికలకు మరికొన్ని వారాలే సమయం ఉండడంతో ఎన్డీఏ, ఇండియా కూట ములు వీలైనన్ని పార్టీలను తమతో కలుపుకుని పోవాలని ప్రయత్నాలు చేస్తున్నాయి.