High Court : హైడ్రాకు హైకోర్టు స్ట్రాంగ్ వార్నింగ్.. ఆ పనులు మానుకోమని హెచ్చరిక..

High Court Warning to Hydra
High Court Strong Warning to Hydra : రాష్ట్ర వ్యాప్తంగా కబ్జాకు గురైన చెరువులు, జలాశయాల విషయంలో చర్యలు తీసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం హైడ్రాను తీసుకువచ్చింది. ఎఫ్టీఎల్ , జలవనరుల బఫర్ జోన్లలో అక్రమంగా వెలిసిన నిర్మాణాలను హైడ్రా మొదటి నుంచి కూల్చివేస్తోంది. ఈ క్రమంలోనే హెచ్ఆర్సీ కొన్ని పేదల నివాసాలను కూడా కూల్చివేయడంతో పెద్ద దుమారం రేగింది. అమీన్పూర్ సరస్సు సమీపంలో హైడ్రా కూల్చివేతలను ఖండిస్తూ కొందరు నిర్వాసితులు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇవాళ హైకోర్టు విచారణ జరిపింది.
హెచ్చార్సీ కమిషనర్ రంగనాథ్ వర్చువల్ గా విచారణకు హాజరవగా, అమీపూర్ తహశీల్దార్ వ్యక్తి గతంగా హాజరయ్యారు. శని, ఆదివారాలలో కూల్చివేత చర్యలు చేపట్టడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆదివారాల్లో పనిచేయడం, సెలవు రోజుల్లో నోటీసులు ఇవ్వడం, ఆ తర్వాత వెంటనే కూల్చివేయడం ఏమిటని కోర్టు ప్రశ్నించింది. వారాంతాల్లో కూల్చివేతలకు అనుమతి లేదని హైకోర్టు గుర్తు చేసిందని, ఈ ప్రాథమిక నియమం తెలియదా అని తహశీల్దార్ ను ప్రశ్నించింది.
తహశీల్దార్ విజ్ఞప్తి మేరకు కూల్చివేతలు చేపట్టినట్లు రంగనాథ్ పేర్కొన్నారు. మేజిస్ట్రేట్ ఇలా అన్నారు, ‘అభ్యర్థనను మీరు సరైన పరిగణన లేకుండా చర్య తీసుకుంటారా? భవనాలు ఖాళీ చేయకపోతే కూల్చివేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. తహశీల్దార్ కోరితే చార్మినార్ ను, హైకోర్టును కూల్చివేస్తారా’ అని ప్రశ్నించారు.
రాజకీయ పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు చట్టానికి విరుద్ధంగా వ్యవహరించ వద్దన్నారు. హైకోర్టు ఆదివారాల్లో కూల్చివేతలను నిషేధించిన విషయం మీకు తెలియదా..? అటువంటి చట్టవ్యతిరేక చర్యలకు మీరు బాధ్యత వహించాల్సి ఉంటుంది జాగ్రత్తగా ఉండండి’ అని హైకోర్టు హెచ్చరించింది.