JAISW News Telugu

Drugs seized : పోస్టాఫీస్ లో రూ.21 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం

FacebookXLinkedinWhatsapp
Drugs

Drugs seized

Drugs Seized : బెంగళూరులోని ఫారిన్ పోస్టు ఆఫీస్ వద్ద  పోలీసులు రూ.21 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. అధికారులు తెలిపిన ప్రకారం.. బెంగళూరులోని ఫారిన్ పోస్టు ఆఫీసు వద్ద నార్కోటిక్స్ కంట్రోల్ యూనిట్ కస్టమ్స్ అధికారులతో కలిసి తనిఖీలు నిర్వహించింది. ఈ క్రమంలో దాదాపు 606 డ్రగ్స్ పార్శిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. వీటిని అమెరికా, బెల్జియం, యూకె, థాయ్ లాండ్, నెదర్లాండ్స్ వంటి దేశాల నుంచి అక్రమంగా రవాణా చేస్తున్నట్లుగా గుర్తించామన్నారు.

స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ లో హైడ్రో గంజాయి, ఎల్ఎస్ డీ, ఎండీఎంఏ క్రిస్టల్స్ తదితర మత్తు పదార్థాలు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. వీటిని బెంగళూరులో అధిక ధరలకు విక్రయించేందుకు నిందితులు ఇండియన్ పోస్టల్ సర్వీస్ ద్వారా దిగుమతి చేసుకున్నట్లు దర్యాప్తులో తేలిందని క్రైం బ్రాంచ్ పోలీసులు వెల్లడించారు. తదుపరి విచారణ కొనసాగుతుందన్నారు.

Exit mobile version