Pawan Kalyan : దుర్గమ్మను దర్శించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

Pawan Kalyan
Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన కుమార్తె ఆద్యతో కలిసి బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయం వద్ద ఆయనకు స్వాగతం పలికిన అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత తీర్థప్రసాదాలు, అమ్మవారి చిత్రపటం అందజేశారు. డిప్యూటీ సీఎంతో పాటు హోంమంత్రి అనిత, ఎంపీ కేశినేని శివనాథ్ కూడా దుర్గమ్మను దర్శించుకున్నారు. ఈరోజు మూలా నక్షత్రం కావడంతో సరస్వతీదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు.