Chandrababu : ‘పి4’తో రాష్ట్రాభివృద్ధికి చంద్రబాబు పిలుపు

Chandrababu
Chandrababu : కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ‘పి4’ అనే అంశానికి ప్రాధాన్యతనిచ్చారు. ‘పబ్లిక్, ప్రైవేట్, పీపుల్స్ పార్టనర్షిప్’ అనే సూత్రంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఆయన భావిస్తున్నారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంలో భాగంగా పది సూత్రాలను రూపొందించామని, అందులో పేదరికం లేని సమాజం ఒకటని ఆయన తెలిపారు. ఆర్థిక అంతరాలు తగ్గించేందుకు సంపన్నులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.