Blue Media-NRIs : ఎన్ఆర్ఐలపై బ్లూ మీడియా ఫైర్.. తమను గుంటనక్కలని పోల్చడంపై ఖండన..

Blue Media Fire on NRIs
Blue Media-NRIs : ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హీట్ రాను రాను మరింత పెరుగుతోంది. నాయకుల విమర్శలు, ప్రతి విమర్శలతోనే కాకుండా ఇది కాస్త పత్రికల్లోకి ఎక్కడంతో ఆయా వర్గాల వారు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల బ్లూ మీడియా ‘సాక్షి’ దినపత్రికలో ఎన్ఆర్ఐలపై ఒక కథనం ప్రచురితమైంది. దీంతో రాష్ట్రం యావత్తు దీనిపై మండిపడుతోంది.
దేశంలో ఎన్నికల ఫీవర్ ఊపందుకోవడంతో ఓటర్లను ఆకర్షించేందుకు రాజకీయ పార్టీలు రకరకాల వ్యూహాలను అమలు చేస్తున్నాయి. అయితే మహా కూటమిగా ఉన్న మూడు పార్టీలపై వ్యక్తిగత, అసభ్యకరమైన విమర్శలు చేయడం ఈ బ్లూ మీడియాకు అలవాటైపోయింది. రెండు రోజుల క్రితం బ్లూ మీడియా ‘గ్రామాల్లోకి గుంట నక్కలు’ అనే శీర్షికతో జక కథనాన్ని ప్రచురించింది. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు భారత్ కు తిరిగి వచ్చే ఎన్ఆర్ఐలను ఉద్దేశించి ఈ కథనంలో వివరించింది.
ఈ కథనంపై వివిధ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా ఎన్ఆర్ఐ కమ్యూనిటీ వారిని ప్రొజెక్ట్ చేసిన తీరుతో తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారు. ఎన్ఆర్ఐల ప్రతినిధి ఒకరు ఈ కథనాన్ని తీవ్రంగా ఖండించారు. వారి మాటలను వెనక్కి తీసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
‘ఎన్ఆర్ఐలు దేశానికి ఎంతో సాయం చేస్తున్నారన్నారు. దేశ ప్రగతికి వివిధ రకాలుగా సహకరిస్తున్నారు. వారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం మంచిది కాదన్నారు. ఎన్ఆర్ఐలు ఒక కులానికి చెందిన వారు కాదు. వారు వేర్వేరు కులాలు, మతాలు, మతాలకు చెందినవారు. ఎన్నారైలంతా ఏ ఒక్క పార్టీకి మద్దతివ్వరనే విషయాన్ని బ్లూ మీడియా గుర్తుంచుకోవాలి. టీడీపీ మద్దతుదారులు, జనసేన మద్దతుదారులు, వైసీపీ మద్దతుదారులు కూడా ఉన్నారు. ఎన్ఆర్ఐలపై వ్యాఖ్యానించే ముందు ఆ భాషను ఎలా ఉపయోగించాలో చెక్ చేసుకోవాలి’ అని ఎన్ఆర్ఐ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు.