JAISW News Telugu

Harirama Jogaiah: జనసేనకు 24 సీట్లు ఇవ్వడం ఏంటి.? హరిరామ జోగయ్య?

FacebookXLinkedinWhatsapp

ఏపీ: టిడిపి తో పొత్తులో భాగంగా జనసేనకు 24 సీట్లు కేటాయించడంపై కాపు ఉద్యమ నేత హరిరామ జోగయ్య మండిపడ్డారు. పొత్తు ధర్మం ప్రకారం సీట్లు కేటాయింపు జరగలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకరు ఇవ్వడం..మరొకరు దేహి అని పుచ్చుకోవడం పొత్తుధర్మనిపించుకోదని ఆయన వ్యాఖ్యానించారు.

జనసేనకు కేవలం 24 సీట్లు ఇవ్వడం ఏంటి అని ఆయన ప్రశ్నిస్తున్నారు. జనసేన పరిస్థితి అంత హీనంగా ఉందా అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరో రెండున్నరేళ్ల సీఎం పదవి చెరిసగం మంత్రి పదవులు దక్కాలి అని పవన్ కల్యాణ్ కు జోగయ్య  గతం లో లేఖ రాశారు.

Exit mobile version