JAISW News Telugu

Pawan-Delhi: నేడు ఢిల్లీకి పవన్.. టిడిపి,జనసేన,బిజెపి పొత్తు ఖరారయ్యేనా?

FacebookXLinkedinWhatsapp

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్  ఢిల్లీకి వెళ్ళనున్నారు. కేంద్రమంత్రి అమిత్ షా తో ఆయన భేటీ అవుతున్నారు. ఇప్పటికే ఢిల్లీ వెళ్ళిన తెలుగుదేశం పార్టీ అధినేత చం ద్రబాబు నిన్న అమిత్ షా నడ్డాతో సమావేశం అయ్యారు.  ప్రస్తుతం ఆయన అక్కడే ఉండగా ఇవాళ పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.  వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయడానికి తెలుగుదేశం, జనసేన, బిజెపి పొత్తుపై అమిత్ షా, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు కలిసి చర్చిస్తారని తెలుస్తోంది. సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చే ఛాన్స్ కనబడుతోంది.

Exit mobile version