Pahelgam : టాయ్ లెట్ కు వెళ్లి బతికిపోయాం.. పెహెల్గామ్ లో భయానక అనుభవం చెప్పిన తెలుగు మహిళ
Pahelgam : “టాయిలెట్కు వెళ్లకపోయి ఉంటే మేము బతికి ఉండేవాళ్లం కాదు” — ఇదే మాట చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్న ఓ తెలుగు మహిళ, తన ప్రాణాలు ఎలా తప్పించుకున్నారో మీడియాతో పంచుకున్నారు. ఈ ఘటన కశ్మీర్ లోని ప్రసిద్ధ పర్యాటక స్థలం పెహెల్గామ్లో చోటు చేసుకుంది.
పర్యటన కోసం కశ్మీర్ వెళ్లిన ఈ మహిళ, అక్కడి ఎయిర్ పోర్ట్ వద్ద ఒక ఫోటో షూట్కు గ్యాప్ రావడంతో, టాయిలెట్కి వెళ్లారు. అప్పటికే అక్కడికి ఉగ్రవాదులువచ్చి అక్కడున్నవారిని చంపారు.. కొన్ని నిమిషాల్లోనే అక్కడ భయానకమైన సంఘటన చోటు చేసుకుంది. ఒక చిన్న పరిణామమే ఆమెకు ప్రాణాన్ని కాపాడింది.
“నాకు అక్కడ ఏం జరిగిందో అర్థం కాలేదు. కానీ అప్పుడు టాయిలెట్కు వెళ్లినందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్తున్నాను. లేకపోతే నేను ఇప్పుడు బ్రతికే ఉండేది కాదు,” అని ఆమె కన్నీటి పర్యంతమై చెప్పిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఈ మహిళను రక్షించిన ఆ చిన్న సంఘటన ఇప్పుడు వేల మందికి జీవిత బోధను ఇచ్చేలా మారింది.
View this post on Instagram